తెలంగాణ రాష్ట్ర రెండో ఆవిర్భావ వేడుకలను ఘనంగా జరుపుకొన్న ఉద్యమ కాలంలో నమోదైన కేసుల్లో ఇంకా ఎందరో ఇబ్బందులు పడుతున్నారని, ఆకేసులన్ని ఎత్తివేసేలా సీఎం కేసీఆర్ చొరవ తీసుకోవాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు బండ శంకర్ కోరారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎందరో విద్యార్ధులు, ఉద్యమ సంఘాల నాయకులు, విద్యార్ధి సంఘా నాయకులు, విద్యార్ధులు పోరాటం చేశారన్నారు. ఉద్యమ సమయంలో నమోదైన కేసుల్లో కొన్ని కాంగ్రెస్ ప్రభుత్వం, మరికొన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం తొలగించిందన్నారు. మిగిలిన వాటిలో నమోదైన వాటి రైల్వే కేసులు, దిష్టిబొమ్మల దగ్దం, వాహనాల దగ్గం వంటి కేసులున్నయన్నారు. ఈ కేసులు నమోదైన వారిలో జగిత్యాల చెందిన జిల్లా జేఏసీ కన్వీనర్, కో-కన్వీనర్ సిహెచ్వి ప్రభాకర్ రావు, సిరిసిల్ల రాజేందర్ శర్మతో పాటు అనేక ఉద్యమ కారులపైన రైల్వే కేసులు నమోదైన ఎన్నో ఇబ్బందులు పడుతున్నరన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఉద్యమ కేసులపై తమ పరిధిలోనివి సీఎం కేసీఆర్ తక్షణమే తొలగించేలా ఆదేశాలివ్వాలని, అలాగే రైల్వే కేసుల ఎత్తివేత పై కేంద్ర రైల్వే శాఖ మంత్రితో కేసులను ఎత్తివేసేలా చొరవ తీసుకోవాలని బండ శంకర్ కోరారు. ఆయనతో పాటు కాంగ్రెస్ నాయకులు భైరి శ్రీనివాస్ గౌడ్, కొత్తకొండ రవిగౌడ్, కాల్వ మల్లేశం, యూత్ కాంగ్రెస్ నాయకులు యం.డి.రియాజ్, దుబ్బ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.